Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
శాసనమండలి ఎన్నికల్లో గెలుపు తనదేనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అలిగిరెడ్డి నర్సిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసన మండలి ఉపాధ్యాయ ఎన్నికల సందర్భంగా శుక్రవారం అలిగిరెడ్డి నర్సిరెడ్డి హసన్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళీనీ పరిశీ లించారు. అనంతరం, పాఠశాల వద్ద టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులతో కలసి మాట్లా డారు. సుమారు 23 ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడంతో మూడు జిల్లాల వ్యాప్తంగా మెజారిటీ ఓట్లు పడుతున్నాయని అన్నారు. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు కష్టపడ్డారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె సోమశేఖర్, జిల్లా కోశాధికారి తాబేటి కుమారస్వామి, రూరల్ జిల్లా కార్యదర్శి టి లింగమూర్తి, ఇన్చార్జి అట్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.