Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
మండలంలోని జూకల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు విద్యారత్న నేషనల్ అవార్డుకు ఎంపిక అయినట్టు బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతియేటా ప్రజాఉద్యమాలకు సంఘ సేవకులు, రచయి తలకు, కవులకు ఈ అవార్డు ఇవ్వనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ప్రధానో పాధ్యాయుడు ఒంటేరు చంద్రశేఖర్ను ఎంపిక కాగా వారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం విజయలలిత, కృష్ణ రమేష్ పాల్గొన్నారు.