Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
31 ఏండ్ల కిందట నిర్మించిన వాటర్ ట్యాంక్ పెచ్చులూడిపోయి శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియక సమీప కాలనీవాసులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. శిథిలావస్థకు చేరిన సదరు ట్యాంకును కూల్చివేసి నూతన ట్యాంక్ నిర్మించాలని దళిత కాలనీవాసులు వేడు కుంటున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని పత్తిపాక గ్రామ దళిత కాలనీ సమీపంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ను 1988లో అప్పటి విద్యుత్ శాఖామాత్యులు నిమ్మ రాజిరెడ్డి ప్రారంభించారు. ఆ ట్యాంక్ ద్వారానే గ్రామం మొత్తానికి నీటిని సరఫరా చేసేవారు. పెరుగుతున్న గ్రామ జనాభా అవసరాలకు అనుగుణంగా బీసీ కాలనీ సమీపంలో మరొక ట్యాంక్ను నిర్మించారు. ప్రస్తుతం పాత వాటర్ ట్యాంక్ ద్వారా కేవలం దళిత కాలనీ వాసులకే నీరు సరఫరా చేస్తున్నారు. కాగా 31 ఏండ్ల కిందట నిర్మించిన ట్యాంకు కావడంతో శిథిలావస్థకు చేరుకున్న ట్యాంకు పెచ్చులూడి పోయి ఐరన్ రాడ్లు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సమీప కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
మండలంలోని పెద్దకొడపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన వాటర్ ట్యాంక్ సైతం ఇదే తరహాలో శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవలే మిషన్ భగీరథ పథకంలో పాఠశాల ప్రాంగణంలోనే నూతన ట్యాంక్ నిర్మించగా.. శిధిలావస్థకు చేరుకున్న మంచినీటి రక్షిత పథకం ట్యాంకులను కూల్చివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పాత ట్యాంక్ను కూల్చేయాలి
గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంకులను కూల్చి వేయాలి. పత్తిపాక గ్రామంలో 31 ఏండ్ల కిందట నిర్మించిన ట్యాంక్ కావడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ట్యాంక్ సమీపంలోనే మా ఇల్లు ఉండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నివసిస్తున్నాం. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ దష్టికి తీసుకెళ్లాం. పాత ట్యాంక్ ను కూల్చివేసి నూతన ట్యాంక్ నిర్మాణం చేపట్టాలి.
- తుడుం కిషన్