Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి
నవతెలంగాణ-నయీంనగర్
మహిళా సాధికారతే దేశ ప్రగతికి నాంది అని నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రమాదేవి అన్నారు.యూఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సెమినార్ రెండో రోజు ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ రమాదేవి హాజరై మహిళా సాధికారిత అనే అంశంపై మాట్లాడారు. మనదేశంలో స్త్రీలకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో దేశం అభివృద్ధి చెందడంలేదని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా స్త్రీక సరైన ప్రాధాన్యత ఇవ్వక పోవడం దురదృష్టకరమన్నారు. తాత్కాలిక చట్టాలు చేసి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మహిళలపై రోజుర్జఉకు దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మహిళలకు ప్రాధాన్యతనివ్వకపోవడం వల్లే దేశాభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్రావు మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న రైతులపై ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. కుల్దీప్సింగ్ (సామాజిక విప్లవకారుడు పంజాబ్) మాట్లాడుతూ దేశంలో ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాలు లేవని, కేవలం పెట్టుబడిదారుల కోసం డబ్బున్న వారి కోసమే పని చేసే ప్రభుత్వాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశ విధా నాలపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్య మించాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఇన్చార్జ లింగం పల్లి శ్రీనివాస్, కార్యదర్శి మాదాల తిరు పతి, ఉపాధ్యక్షులు బోనాల సునీల్చారి, చంద్ర పురం మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు గణేష్, రవి ,మహేష్, సతీష్, సోని పాల్గొన్నారు.