Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ పాలనకు నాలుగేండ్లు నిండుకున్నాయి. అందువల్ల రాష్ట్ర బడ్జెట్కు ప్రాధాన్యత ఉన్నది. గత నాలుగేండ్లలో చేసిందేమిటన్న ప్రశ్న కూడా ఇప్పుడు చర్చనీయాం శమే! కేవలం రాబోయే ఏడాదికి బడ్జెట్ కేటాయింపులు మాత్రమే చూస్తే నిజాలు నిగ్గుతేల్చలేము. ఎన్నికల సంవత్సరం కావటంతో సాధారణ ప్రజలను ఆశల ఊయల లో ఊపే ప్రయత్నం చేసింది ఈ టల బడ్జెట్. మరోవైపు ఆర్థిక సర్వే నూ పరిగణనలోకి తీసుకోలేదు. వెనుకబడిన జిల్లాల గురించి విస్మ రించారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో గత ఏడాది వరకు ఏం చెప్పినా జనం నమ్మారు. ఇప్పుడు కూడా నమ్మించాలన్నది పాలకుల ఆంతర్యం. పైగా ఆశలు చూపి ఓట్లు రాబట్టాలన్న లక్ష్యమే తప్ప చిత్తశుద్ధి కనబడదు.
ఆదాయాన్ని పెంచి చూపడం, సంక్షేమానికి ఎక్కువ కేటాయింపు లు చేసామని చెప్పుకోవటమే ఇప్పుడూ జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలన్న నినాదమే జనం చెవులలో గింగురుమం టోంది. కోటి ఎకరాలకు నీరు అందిస్తామన్న ప్రభుత్వం ఆశలు చూపడమే తప్ప అమలు లేదు. కేటాయిం పులు భారీగానే ఉన్నాయి. రూ.25వేల కోట్లు మళ్లీ చూపించారు. గత నాలుగు సంవత్సరాలలో కేటాయించిన మొత్తంలో ఖర్చు చేసింది కేవలం 63శాతం మాత్రమే. పైగా రీడిజైన్ పేరుతో ప్రాజెక్టుల అంచనా వ్యయం రెట్టింపు అయ్యింది. అంచనా వ్యయం పెరుగుతూ, ఖర్చు పెట్టేది తగ్గింది. ఈ ఒక్క సంవత్సరంలో కేటాయించిన మొత్తం ఖర్చు చేసినా సాధించే ఫలితం నామమాత్ర మే. కోటి ఎకరాలకు నీరు నినాదం కలగానే మిగిలింది. సాగునీటి ప్రాజెక్టుల కంటే కంపెనీ వ్యవసాయంవైపే బడ్జెట్ మొగ్గుచూపుతున్న ఛాయ లున్నాయి. సంక్షేమం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కేటాయింపులూ పెంచి చూపారు. కానీ కోత పెట్టే బడ్జెట్ సంక్షేమ రంగానిదే కావటం గమనించాలి. గత నాలుగు సంవత్సరాలలో దళితులు, గిరిజనుల కోసం చేసిన బడ్జెట్ కేటా యింపులు గానీ, సబ్ప్లాన్ నిధులు గానీ ఖర్చు చేసిన తీరు గమనిస్తే ఇదే అర్థమవుతున్నది. కేటాయించిన నిధులలో సగం కూడా ఖర్చు చేయలేదు.
కేవలం 48 శాతం నిధులు ఖర్చు చేసి మిగిలిన నిధులు ఇతర శాఖలకు బదలాయించారు. ఈ 48శాతంలో కూడా తిమ్మిని బమ్మిని చేసే పద్ధతులు అనుసరించినట్టు తెలుస్తున్నది. పౌర సరఫరాల శాఖకు, ఉపాధి హామీ కోసం చేసిన ఖర్చు కూడా ఎస్సీ, ఎస్టీ నిధుల జాబితాలో చూపించారు. నిజానికి వివిధ శాఖల నుండి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కోసం కేటాయించిన నిధులు వారి అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించి ఖర్చు చేయాలి. ఇందుకో సం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి నిధులు అప్పగించాలి. ఇవేమీ చేయకుండానే ఇతర అవసరాలకు వాడుతున్నారు. చట్ట ప్రకారం గత బడ్జెట్లో ఖర్చు కాని నిధులు క్యారీ ఫార్వర్డ్ కూడా చేయలేదు. ఎంబీసీల కోసం కేటాయించిన వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదు.
రైతుల గురించి మాట్లాడని రోజు లేదు. కానీ ఆత్మహత్యలు ఆపేందుకు చొరవ కూడా ఈ బడ్జెట్లో లేదు. ఎకరానికి నాలుగు వేల పెట్టుబడి సాయం చూపించి సంబురపడాలంటున్నారు. రుణ మాఫీ పథకం రైతుల ఆత్మహత్యలను ఆపలేకపోయింది. ఇది తెలిసి కూడా ఇంకా సమస్య మూలాలలోకి పోయేందుకు పాలకులు సిద్ధంగా లేరు. పెట్టుబడి సాయం తీసివేస్తే వ్యవసాయరంగానికి కేటాయించిన మొత్తంలో వ్యవసాయం అభివృద్ధికి మిగిలింది పెద్దగా లేదు. విద్యారంగంలో కేజీ టు పీజీ పేరుతో నాలుగేండ్లుగా ఊరించడ మే తప్ప సాధించింది పరిమితమే. ఇప్పుడు కేటాయింపులు కూడా గొర్రెతోక బెత్తెడన్నట్టే ఉన్నాయి. గత బడ్జెట్తో పోల్చుకుంటే పెద్దగా పెంచిందేమీ లేదు.
ఇప్పటికే అక్షరాస్యతలో రాష్ట్రం వెనుకబడి ఉన్నది. దేశంలో సగటు అక్షరాస్యత 74శాతం కాగా రాష్ట్రంలో 64శాతమే. వైద్య, ఆరోగ్య రంగానికి కేటాయింపులు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిల పేరుతో కార్పొరేట్ వైద్యశాలలు మొండికేస్తున్నాయి.
రోగులు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించనిదే వైద్యం నిరాకరిస్తున్నాయి. విద్యుత్ రంగంలో అప్పులకు, బడ్జెట్లో కేటాయింపులకు పొంతన లేదు. ఆర్టీసీని పట్టించుకోలే దు.ఉపాధి అవకాశాలు పెరగలేదు. సంవత్సరంలో లక్షా ఏడు వేల ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు నాలుగేండ్లలో ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కల ప్రకారమే ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 27,588. పారిశ్రామిక రంగంలో కొత్తగా 3,703 పరిశ్రమలొచ్చాయన్నారు. ఎంతమందికి ఉపాధి లభించిం దన్నది అసలు సమస్య. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పారిశ్రామికవేత్తల సౌకర్యాల మీద ఉన్న శ్రద్ధ ఉపాధి కల్పన మీద లేకపోవడం గమనార్హం. పోలీసు శాఖ మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఆధునీకరణ, సిబ్బంది నియామకాలు, ప్రమోషన్లు, వాహనాల కొనుగోలు, ఆధునిక సాంకేతిక పరికరాలు అందించటంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పోలీసు శాఖను పటిష్ట పరిచింది. ఈ బడ్జెట్లో కేటాయింపులు కూడా పెంచింది. ఇవన్నీ చేసింది నేరాలు అదుపు చేయడానికే అనుకుంటే పొరపాటే. ఆర్థిక మంత్రి అట్లా చెప్పుకున్నప్పటికీ నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం ఈ కాలంలో నేరాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ప్రజా ఉద్యమాల మీద ఉక్కుపాదం మోపటంలో మాత్రం ప్రభుత్వం ముందుపీఠిన ఉన్నది.