Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంకా టీఆర్ఎస్ సర్కారు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడలేదు. ఒకవైపు సామాజిక పొందిక, మరోవైపు కష్టపడి పనిచేసే వారికే అవకాశం కల్పించేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కసరత్తు ప్రారంభించారని వినిపిస్తున్నది. ఫెడరల్ ఫ్రంట్ను ఉనికిలోకి తెచ్చేందుకు కూడా మంత్రివర్గ విస్తరణను ఒక అవకాశంగా తీసుకో వాలని భావిస్తు న్నారు. మార్గదర్శకాల ప్రకారం మ్యాజిక్ ఫిగర్ 18 దాటకుండా ప్రయత్నిం చక తప్పదు. ఇప్పటికే సీఎం, మరో మంత్రికాక 16 మందినే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొక రాజ్యాంగ ప్రక్రియ. ఆలస్యమైతే అనవసర సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులూ, న్యాయ నిపుణుల నుంచీ వస్తున్నాయి. మంత్రివర్గంలో పూర్తిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అనుచరులు ఉండేలా జాగత్తలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్, కేటీఆర్ ఉమ్మడిగా ఈ విషయమై సమాలోచనలు చేస్తున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. నిజాని కి మంత్రివర్గం రాష్ట్ర పరిపాలన వ్యవస్థను సమన్వయం చేసేలా ఉండాల్సిన అవసరం ఉన్నది. అదే సందర్భంలో సామాజిక పొందికా కీలకమే. గత మంత్రివర్గంలో మహిళలకు చోటులేకపోవడం, విస్తరణ సందర్భంగా కూడా న్యాయం చేయకపోవడంతో ఆ పార్టీలోనే కొంత అస ంతృప్తి ఉన్నది. ఇప్పుడు ఒత్తిడి తీవ్రమైంది. కులాల వారీగా ప్రాతినిధ్యం కల్పించాలా? సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకోవాలా? రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకోవా లా? అనే విషయంలో కేసీఆర్ తర్జనభర్జ నలు పడుతున్నారు.
పార్టీని బలోపేతం చే యడంతోపాటు ప్రభుత్వాన్ని సమర్థ వంతంగా నడిపించే సామర్థ్యమున్న నేతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.
పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించినట్టుగా, మంత్రివర్గంలోనూ అన్యాయం చేయరాదనే మరో డిమాండ్ ముందుకు వస్తున్నది. ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకుగాను పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులను రంగంలోకి తెచ్చి, పదవులను ఆశిస్తున్న కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. క్యాబినెట్ కూర్పు గెలిచిన, ఓడిన నేతలతోపాటు ఎమ్మెల్సీలతో కూడి ఉంటుందని ఇటీవల ప్రగతిభవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే కేసీఆర్ చుట్టూ రెండు సామాజిక తరగతులకు చెందిన బలమైన ఆర్థిక శక్తులు కోటరీగా ఉన్నాయన్న అభిప్రాయం కూడా ఉన్నది. వాటి మాట వింటారా ? లేక తనదైన శైలిలో కూర్పును పూర్తిచేస్తారా ? అనేది ప్రస్తుతం చర్చనీయాం శం. ఇదిలావుండగా మంత్రివర్గంలో అసలు కేటీఆర్, హరీశ్రావులకు స్థానం ఉంటుందా ? అనేది కూడా మిలియన్డాలర్ల ప్రశ్న. కేటీఆర్ను పార్లమెంటు ఎన్నికల అనంతరం నేరుగా సీఎం పీఠంపై కూర్చోబెడతారని, అంతవరకు క్యాబినెట్ బయట ఉండే చక్రం తిప్పుతారని తెలంగాణభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హరీశ్ని ఏకంగా తనతోపాటు జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు ఆపార్టీ వర్గాలే అంటున్నాయి. స్పీకర్ పదవి విషయంలోనూ చర్చోపచర్చలు చోటుచేసుకుంటున్నాయి. ఆ పదవిని వద్దు అంటే వద్దు అని ఎమ్మెల్యేలు అంటున్నారని తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో ఎవరిని ఆ పదవికి ఎంపిక చేస్తారనే విషయంలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ సీజన్లో ఉపాధి హామీ పనులు ఊపందుకోలేదు. వేసవికిముందే ప్రణాళికాబద్ధంగా పనులను గుర్తించడం, వాటిని కూలీలకు అప్పగించి ఉపాధి మెరుగుపడేలా చర్యలు తీసుకోవడం కీలకం. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈనేపథ్యంలో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. వాటిని నివారించడంలో ఇటు ప్రభుత్వం, అటు పోలీస్ యంత్రాంగం ఆశించినస్థాయిలో చురుగ్గా వ్యవహరించడం లేదు. ఈనేపథ్యంలో యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఒక పౌరుడు అసువులు బాశాడు. ఆసరా పింఛన్లు ఇస్తున్నామని ఘనంగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ సర్కారు, డిసెంబరు నెల పింఛన్లు ఇంకా ప్రజలకు అందజేయడంలో విఫలమైంది. మంత్రివర్గం లేకపోవడంతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి. ఇలా అనేక సమస్యలు పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవడం మూలంగా వెనుకబడే ఉన్నాయి. ఇప్పటికైనా మంత్రివర్గం ఏర్పాటు చేయటం అవసరం. రాజకీయ అవసరాల కోసం మంత్రివర్గం ఏర్పాటు ప్రక్రియని ఆలస్యం చేయడం తగదు.