Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల సొమ్ముతో సేకరించిన తమ ఆధీనంలోని ఆహారధాన్యాన్ని ఆపత్కాలంలో తిరిగి వారికి అందించేందుకు అంగీకరించని పాలకుల వర్గ దృక్పధానిదే ఇందుకు వంద శాతం బాధ్యత. నిజం! వారి దోపిడీ వర్గ పాలక దృక్పథం ప్రజలను ఆకలితోనైనా చంపుతుందేగాని, ప్రజలు సృష్టించిన సంపదను తిరిగి వారికి చేర్చేందుకు చచ్చినా అంగీకరించదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ చరిత్రను మార్చడమే ఇప్పుడు శ్రామిక ప్రజల ముందున్న చారిత్రక కర్తవ్యం!
మేకలతో తమ ఆకలి తీర్చుకుంటాయిగానీమేకల ఆకలి
పులులెందుకు పట్టించుకుంటారు?- అవును! ఈ దేశపు పేదలు పులుల సంరక్షణలోని మేకలు. కావునే, ఒక వైపు ప్రభుత్వం వారి గోదాముల్లో లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పందికొక్కుల పాలవు తుంటే, మరో వైపు కోట్లాది పేదలు ఆకలి కడుపులతో అలమటి స్తున్నారు. అభం శుభం తెలియని పసిపిల్లలు ఆకలి చల్లార్చు కునేందుకు గడ్డి తింటుంటే, ప్రభుత్వ గోదాముల్లో ఎలుకలు విలాసవంత జీవితం గడపగలుగు తున్నాయి! కసాయి (కాషాయి) మూకల ఏలికలో మనిషిగా జన్మించడం కన్నా ఆవుగానో, ఆంబోతుగానో, పాముగానో, పందికొక్కుగానో పుట్టడమే మేలని భావించే దుస్థితి దాపురించింది.
నిజంగానే భారతదేశం భాగ్యసీమ. సకల సంపదలకు కొదువలేని సిరుల మాగాణి. మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మగౌరవంతో జీవించేందుకు కావాల్సిన వనరులన్నీ వందశాతం ఉన్న దేశం. అయినా ఈ భాగ్యసీమ ప్రంచంలో ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 199 దేశాలలో 100వ స్థానంలో నిలిచింది. దేశంలోని 25శాతం జనాభా ఆకలిబాధతో అలమటిస్తోంది. ఏకంగా 19కోట్ల ప్రజ పోషకాహార లోపంతో కూనరిల్లుతోంది. 1995 నుంచి ఇప్పటి వరకూ సంవత్సరానికి సగటున 10వేల మందికి పైగా రైతులు బలవన్మరణాల పాలవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే 'పండించే వాడు- పనిచేసే వాడు' - ఇరువురూ తిండిలేక ఇక్కట్ల పాలవుతున్నారు. ఇక వద్దురా ఈ బతుకంటూ విషం తాగి చస్తున్నారు. లేకుంటే, చస్తూ బతుకుతున్నారు. బతుకుతూ చస్తున్నారు.- ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడం మీదే ఈ దేశ పేదల బతుకు ఆధారపడి ఉంది. ఈ ప్రశ్నకు సాధించే సమాధానంలోనే భావితరాల భవిష్యత్ ఇమిడి ఉంది.
సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా 1990ల నుంచీ ఈ దేశ ప్రజల ప్రధాన జీవన వనరు అయిన వ్యవసాయం వ్యాపారంగా మారిపోయింది. వ్యవసాయానికి ఆధారమైన భూమి, నీరు పెట్టుబడిగా మారి పెట్టుబడి దారుల చేతుల్లో బందీ అయిపోయాయి. విత్తనాలను కార్పొరేట్లు వశపరచుకుని, ఎరువులు, రసాయనాల వాడకంపెరిగి పెట్టుబడి పెనుభారమయ్యింది... వెరసి, వ్యవసాయం ఇప్పుడు కార్పొరేట్లకు అక్షయ పాత్ర. కర్షకులకు ఖాళీ కంచం. మరో వైపు వ్యవసాయ అనుబంధ వృత్తులు విచ్ఛిన్నమై, వ్యవసాయ ఆధారిత కూలి పనులు అదృశ్యమై అదనపు చేతులకు పని కల్పించాల్సిన అదనపు భారం కూడా వ్యవసాయ రంగం మీదే పడింది. దేశంలో గత 20సంవత్సరాల కాలంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు రెట్టింపు అయ్యాయంటే ఇప్పుడు వ్యవసాయ రంగం ఎంత వత్తిడిని ఎదుర్కొంటుందో, భరింపరాని భారం మోస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా, అవసరానికి మించిన చేతులు పోగుపడడంతో, ఆ చేతుల శ్రమకు అందే ప్రతిఫలం తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో, దేశంలో 60శాతానికి పైబడి ఉన్న ప్రధాన సమూహమైన వ్యవసాయాధారిత ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. పారిశ్రామిక రంగ మందగమనం, పరాకాష్టకు చేరిన నిరుద్యోగానికి తోడు కరోనా మహమ్మారి విలయతాండవంతో ఆకలి కేకలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి సమయంలోనే పాలకులు ఎఫ్సీఐలో నిలువ ధాన్యాలను యుద్ధ ప్రాతిపదికన ఆకలి కడుపుల వద్దకు చేర్చాలి. ఆపని చేయలేదు సరికదా, నిలువ ధాన్యాలతో శానిటైజర్లు చేసి అమ్ముకోమని వ్యాపారులను కేంద్రం పురమాయించి తన వర్గ స్వభావాన్ని బైటపెట్టుకుంది. కేంద్రం నిర్వాకంతో ఆహార ధాన్యాల నిల్వల పేరిక పెరిగి పెరిగి ఈ సంవత్సరం జనవరి 1 నుంచి మే 1లోపు 65లక్షల టన్నులు (బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు) పందికొక్కుల పాలైపోయాయి.
మన భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఆహార భద్రతను వాగ్దానం చేసింది. దేశంలో ఎంత సంకట స్థితి నెలకొన్నా, దేశం ఎంతటి సంక్షోభంలో కూరుకున్నా ప్రజలు ఆకలి పాలపడకూడదని, ఆకలి చావులకు గురికాకూడదనీ గొప్ప సంకల్పం చెప్పుకుని బారత ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)ని ఏర్పాటు చేసింది. రైతులు పండించిన ఆహార ధాన్యాలను న్యాయమైన రేట్లకు కొనుగోలుచేసి, వాటికి మరపట్టించి (ప్రాసెసింగ్) వండుకునేందుకు సిద్దంగా నిలువ చేయడం ఎఫ్సీఐ బాధ్యత. అలాంటిది, కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోన్న ఈ మహా సంక్షోభ సమయంలో ఎఫ్సీఐలోని లక్షల టన్నుల ధాన్యాన్ని ఎలుకలు, పంది కొక్కులు కొరుక్కు తినేయడమేమిటి? ఆహార ధాన్యాలు పండించిన అన్నదాతలు సైతం 'మాదా కవళం తలీ'్ల అంటూ బిచ్చగాళ్ళుగా మారి బిచ్చమెత్తుకోవడమేమిటి? ఇందుకు కారణమెవ్వరు? బాధ్యత ఎవరిది? నెపం అధికారుల మీదికి నెట్టేస్తే అంతకు మించిన ఆత్మ వంచన మరొకటి ఉండదు. ఇందుకు వందశాతం కారణం పాలకులే. బాధ్యత పాలకులదే. ప్రజల సొమ్ముతో సేకరించిన తమ ఆధీనంలోని ఆహారధాన్యాన్ని ఆపత్కాలంలో తిరిగి వారికి అందించేందుకు అంగీకరించని పాలకుల వర్గ దృక్పధానిదే ఇందుకు వంద శాతం బాధ్యత. నిజం! వారి దోపిడీ వర్గ పాలక దృక్పథం ప్రజలను ఆకలితోనైనా చంపుతుందేగాని, ప్రజలు సృష్టించిన సంపదను తిరిగి వారికి చేర్చేందుకు చచ్చినా అంగీకరించదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ చరిత్రను మార్చడమే ఇప్పుడు శ్రామిక ప్రజల ముందున్న చారిత్రక కర్తవ్యం!