Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
నవతెలంగాణ-సిద్దిపేట టౌన్
గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన పల్లెప్రకతి వనాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రామ రెడ్డి అదికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీట ింగ్ హాల్లో జిల్లాలో పల్లె ప్రకతి వనం పనుల పురోగతిపై రెవెన్యూ డివిజన్ బాధ్యులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు అతి సమీపంలో ఎకరం లో నాలుగు వేల వరకు 20 రకాల మొక్కల తో ప్రకతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొం దించే విధంగా వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఏయిర్ జిమ్, పిల్ల లకు ఆట సామగ్రిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శ్మశానవాటికలు, డంప్యార్డులు, రైతు వేదికల నిర్మాణ పనులను డివిజన్ రెవెన్యూ అధికారి, ఇతర డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేగవంతం చేసేందుకు వీలుగా హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్కు జెడ్పీ సీఈవో శ్రవణ్కు, గజ్వేల్ రెవె న్యూ డివిజన్ కు డీఆర్డీఓ గోపాల్ను , సిద్దిపేట రెవెన్యూ డివిజన్కు డీపీఓ సురేష్లకు బాధ్యతలను అప్పగిస్తున్నట్టు తెలిపారు.
గజ్వేల్, ప్రజ్ఞాపూర్ నుంచి కోడూరు వరకు రాజీవ్ రహదారి కి ఇరువైపులా ఉపాధి హామీ పథకంలో భాగంగా మిస్సింగ్ గ్యాప్స్, అదనపు వరసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీ డీవోలు, ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. శిక్షణ కలెక్టర్ దీపక్ తివారీ పర్యవేక్షణలో మొత్తం ప్లాంటేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లు ఎస్ పద్మాకర్, ముజమ్మీల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ దీపక్ తివారీ, జెడ్పీసీఈవో శ్రీ శ్రవణ్, అధికారులు గోపాల్ , సురేష్, ఫారె స్ట్ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.