Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనుల్లో జాప్యం తగదు
జిల్లా కలెక్టర్ హనుమంతరావు
నవతెలంగాణ-హత్నూర
మండల పరిధిలోని కాసాల గ్రామ శివారులో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం తగదని త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగితే శాఖాపరమైన చర్యలు తప్ప వని హెచ్చరించారు. రైతు వేదిక నిర్మాణం పనుల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిల వాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయరామ్ నాయక్, దౌల్తాబాద్ సర్పంచ్ కొన్యాల వెంకటేశం, వీఆర్ఓ శ్రీధర్ గౌడ్, కాసాల గ్రామ టిఆర్ఎస్ నాయకులు రామ చంద్రారెడ్డి, బైసాని వెంకటేష్ గుప్తా, కాంట్రాక్టర్ అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు.