Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలి
- సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-సంగారెడ్డిటౌన్
ప్రయివేటు విద్యాసంస్థల సిబ్బందికి వేతనాలు చెల్లించేటట్టు చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే రాజయ్య మాట్లాడుతూ ప్రయవేటు విద్యా సంస్థలు కరోనాను అడ్డం పెట్టుకొని వేతనాలు చెల్లించడం లేదని, ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కార్పొరేట్ స్కూల్లో సిబ్బందికి 100 శాతం వేతనాలు చెల్లిం చాలని, చిన్న విద్యా సంస్థల వారికి ప్రభుత్వ వేతనాలు చెల్లిం చాలన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యే వరకు నిత్యావసర సరుకులు సిబ్బందికి అందజే యాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కోశాధికారి సాయిలు, సహాయ కార్యదర్శి సురేష్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ..
అమీన్పూర్ అనాథాశ్రమం నిందితులను కఠినంగా శిక్షించాలి...
అమీన్పూర్లోని అనాథాశ్రమంలో అమ్మాయిపై లైంగిక దాడి, మృతిపై సమగ్ర విచారణ జరపాలని, నింది తులందరినీ కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా కమిటీ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ డిమాండ్ చేశాయి. జిల్లా కార్యదర్శి రాజయ్య, జిల్లా అధ్యక్షుడు మల్లేశం, మంగ రమేశ్వరీ శ్రామిక మహిళ సమన్వయ కమిటీలో ఉన్నారు.
సివిల్ సప్లయి హమాలి సమ్మె తాత్కాలిక వాయిదా....
పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ శ్రీనివాస్రెడ్డి వివిధ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 12 ,13 తేదీల్లో రెండు రోజులపాటు సమ్మె రాష్ట్రవ్యాప్తంగా జయప్రదంగా జరిగింది. బ్యాగ్ రేట్లు పెంచాలని, యూనిఫామ్, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, ప్రమాద బీమా అమలుచేయాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకపోతే మళ్లీ సమ్మె తప్పదని హెచ్చరించారు.