Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ బిల్లుల చెల్లింపులో జిల్లాలోనే మొదటి స్థానం
ఎంపీపీ అధ్యక్షులు గిరిదర్ రెడ్డి
నవతెలంగాణ-జహీరాబాద్
అందరి సహకారంతోనే అభివృద్ది సాధ్యమని ఎంపీపీ అధ్యక్షులు గిరిదర్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీపీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఇరిగెేషన్, ఫారెస్ట్, విద్యుత్, వైద్యశాఖల అధికారులు అనుకున్న స్తాయిలో ప్రజలకు సేవలు అందించలేకపోతున్నారన్నారు. జిల్లాలోనే జహీరాబాద్ మండలం వీధిదీపాల చార్జీలు చెల్లించడంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు చెందిన పాత విద్యుత్ బకాయలు చెల్లిం చకూడదని, మాఫీ చేస్తున్నామని ప్రకటించాక కూడా విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు కట్టాలని నోటీసులు ఇస్తున్నారని ఎంపీపీ ఉపాధ్యక్షులు రాములు, కోత్తుర్ (బి), సత్వర్, చిరాగ్పల్లి గ్రామాల సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీడీవో రాములు, ఎంపీవో మహేష్లు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో నీటిస రఫరా కోసం బోర్లకు మోటార్లు కేటాయించినట్టు రికార్డుల్లో ఉన్నా వాస్తవంలో అవి లేవన్నారు. పీహెచ్సీల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించినా మల్చెల్మ, మోగుడంపల్లి పీహెచ్సీల్లో ఎందుకు పరీక్షలు నిర్వహించడం లేదని సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలు అధికారులను ప్రశ్నించారు. అయితే దీనికి వైద్యురాలు శ్రీవల్లి స్పందిస్తూ మల్చెల్మ పీహెచ్సీ పారి శుధ్య సిబ్బంది కొవిడ్ బారిన పడడంతో అక్కడ టెస్టులు నిర్వహించడంలేదని దానికి బదులు జహీరా బాద్లోని కమ్యూనిటీ వైద్యశాఖలో నిర్వహిస్తున్నామని తెలిపారు. జెడ్పీటీసీ నాగిశెట్టి రాతోడ్ మాట్లాడుతూ.. గిరిజనులు కొన్నేండ్ల నుంచి సాగుచేసుకుంటున్న భూము లకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని తహసీల్దార్ను ప్రశ్నించారు. ఏవో ప్రవీణ, ఏఈపీఅర్ కోటెశ్వర్ రావు, సీడీపీవో బ్రహ్మజీ తదిరతులు పాల్గొన్నారు.