Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి నల్లవెల్లి రమేష్
నవతెలంగాణ-సంగారెడ్డి టౌన్
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మధిర కాలనీలోని మారుతి అనాథ శరణాలయానికి ఏదో ఒక రూపంలో నిధులు ఇచ్చే నెపంతో అక్కడికి తరచుగా వచ్చే వేణుగోపాల్ రెడ్డిో బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడి చేయడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శరణాలయం నిర్వాహకులు విజయ సహకరించడంతో వేణుగోపాల్ ఈ ఘాతు కానికి పాల్పడ్డాడన్నారు. లైంగిక దాడికి పాల్పడిన అతనికి ఉరిశిక్ష వేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోందని తెలిపారు. అలా చేస్తే తప్ప ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావతం కావన్నారు. అలాగే అతనికి సహకరించిన నిర్వాహకులు విజయ, జయదీప్లకు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు సందీప్, నాయకుడు రాజ్, చిన్న, ఉన్నారు
గుమ్మడిదల : అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అనాథాశ్రమంలో 14ఏళ్ల బాలికపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర యువజన సంఘాల కార్యదర్శి చెన్నంశెట్టి ఉదయకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ ఘటనపై స్పందిస్తూ గుమ్మడిదల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్ని చట్టాలు ఉన్న లైంగికదాడి విషయంలో శిక్షలు సరిగ్గా అమలు జరగటం లేదని, అత్యాచారం ఘటనలో ఒకటి రెండు ఊరి శిక్షలు మాత్రమే అమలు అయ్యాయని, కొన్ని ఘటనలో కింద కోర్టులో ఊరి శిక్షలు పడ్డా నిందితులు పై కోర్టులో అప్పీల్ చేసుకోగా పై కోర్టులు యావజీవ శిక్షలు విధించారన్నారు. ఇలా కాకుండా దీనికి ప్రభుత్వాలు పార్లమెంటులో సరైన చట్టం తీసుకొచ్చి శిక్షలు అమలు చేయాలని కోరారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, నరేష్, నవీన్ సాగర్,బండల అనిల్, యోగేందర్, యువకులు తదితరులు పాల్గొన్నారు