Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, వీరయ్య
జయప్రదమైన సీపీఐ(ఎం) ఆన్లైన్ బహిరంగ సభ
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవ లంభిస్తున్నాయని, వెంటనే ఇరు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధా నాలను వీడాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. కరోనా కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు-ప్రజా సమస్యలు - రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై సీపీఎం పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభ శుక్రవారం నిర్వ హించారు. ఈ ఆన్లైన్ బహిరంగ సభకు సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షత వహించగా వేలాది మంది ప్రజలు వీక్షించారు. బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, జీ నాగయ్యలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అను సరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ ంటున్నారని విమర్శించారు. పేదలపై ప్రభుత్వాలు భారాలు వేయడం సరి కాదన్నారు. కార్మిక చట్టాలను కాలరాస్తూ, పెట్టుబడి దారులు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు బ్యాంకులకు ఎగ్గొట్టిన 80 వేల కోట్ల రూపా యలను రద్దుచేసి సంపన్నుల ప్రయోజనాలు నెరవేర్చే విధానాలు అనుసరిస్తున్నారన్నారు. కోట్లాది మంది ప్రజలు కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి, ఉద్యోగాలు పోయి పనులు లేక అల్లాడుతు న్నారని అలాంటివారికి ప్రయోజనం చేకూర్చే విధంగా, ఆర్థికంగా ఆదుకునే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ప్రతీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ. 7500 ఇవ్వాలని, ప్రతీ మని షికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని, ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచాలని, రోజుకు రూ. 600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉచిత వైద్యం అందించాలి....
రాష్ట్రంలో కరోనా వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఆ ఆస్పత్రులన్నింటిని ప్రభుత్వ ఆధీ నంలోకి తీసుకుని ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని సీపీ(ఐ)ఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ. నాగయ్య డిమాండ్ చేశారు. ఆన్లైన్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను పట్టిం చుకోకుండా ప్రభుత్వం సెక్రటరియేట్ కట్టడం చూస్తుంటే రాజుల పైసా రాళ్ల పాలు అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, రైతుల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, మండలానికో 30 పడకల హాస్పిటల్, నియోజకవర్గానికి నిమ్స్ లాంటి ఆస్పత్రిని పెడతానని హామీ ఇచ్చిన మాటలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుకి రూ. 1500 ఇవ్వాలని, కరోనా చికిత్స ను ఆరోగ్యశ్రీ లో చేర్చి పేద ప్రజలందరికీ వైద్యం అందించాలని,ప్రయివేటు ఆస్పత్రిలోనూ ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ సర్పంచ్ కాముని గోపాలస్వామి, మాజీ జెడ్పిటిసి దాసరి కళావతి, రాళ్లబండి శశిధర్, సందబోయిన ఎల్లయ్య తదితరులు ప్రసంగించారు.