Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట జిల్లాలో నేడు ప్రారంభం కానున్న
సామూహిక మరుగుదొడ్లు మహిళల కోసం ప్రత్యేకం
స్వచ్ఛతే తమ లక్ష్యంగా.. పట్టణాల్లో పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వం ఇప్పటివరకు అనేక పథకాలను తీసుకువచ్చింది. ఇంటింటికి చెత్త సేకరణ, ఫ్రైడే రోజు డ్రైడే, ఆదివారం పది నిమిషాల పాటు ప్రతి ఇంట్లో శుభ్రత ఇలా స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మరో ముందు అడుగు వేసి పట్టణాల్లో జన సంవర్ధన ప్రాంతాలలో, జనాభా ప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని అన్ని మున్సి పాలిటీలలో మరుగుదొడ్లకు పడుతున్న అవస్థలు దూరం చేసేందుకు ముఖ్య కూడళ్లలో సామూహిక మరుగు దొడ్లు స్వాతంత్య్ర దినోత్సవం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
నవతెలంగాణ - సిద్దిపేట టౌన్
వెయ్యి జనాభాకు ఒక మరుగుదొడ్డి ఉండాలనే ప్రభుత్వ ఆదేశాలను అధికార యంత్రాంగం అమలులో భాగంగా వేగంగా నిర్మాణాలు సాగుతున్నాయి. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు సూచనల మేరకు నేటి నుంచి సామూహిక మరుగుదొడ్లు ప్రారంభమవనున్నాయి.
జిల్లాలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందినా సరిపడా సామూహిక మరుగుదొడ్లు లేక స్వచ్ఛతకు విఘాతం కలుగుతు వచ్చింది. పురపాలికల్లో జనాభా, ప్రాంతాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. అదే సమయంలోసామూహిక మరోగుదొడ్ల సమస్య మరింత తీవ్రంగా మారింది. పట్టణ వాసులతో పాటు రోజూవారిగా వివిధ పనుల నిమిత్తం గ్రా మం నుంచి, ఇతర ప్రాంతాలకు చెందినవారు వేల సం ఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్నేండ్ల క్రితం పట్ట ణంలో మరుగుదొడ్లు నిర్మించినా.. అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ వెయ్యి జనాభాకు ఒక మరుగుదొడ్డి ఉండాలని కచ్చితమైన నిబంధన పెట్టి ంది. పురుషులు, మహిళల జనాభాకు అనుగుణంగా మరు గుదొడ్లను నిర్మించాలని సూచించింది .అందులో భాగంగా పురపాలికల్లో జనాభా లెక్కల ప్రకారం 222 మరుగుదొడ్లు ఉండాల్సి ఉంది. తక్కువగా ఉండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఏ మున్సిపాలిటీ లో ఎన్ని....
-హుస్నాబద్ మున్సిపాలిటీ లో జనాభా ప్రకారం 22 మరుగుదొడ్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 3 మాత్రమే ఉన్నాయి. ఇటీవలే మరో రెండింటిని పూర్తి చేశారు. మిగ తావి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
-చేర్యాల మున్సిపాలిటీ లో 18 సౌచాలయాలు ఉం డాల్సి ఉండగా, ప్రస్తుతం 10 మరుగు దొడ్లు ప్రజలకు అం దుబాటులో ఉన్నాయి. మిగతావి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
-గజ్వేల్ మున్సిపాలిటీ లో 37 సౌచాలయాలు ఉం డాల్సి ఉండగా, ప్రస్తుతం 24 మరుగు దొడ్లు ప్రజలకు అం దుబాటులో ఉన్నాయి. ఇటీవలే మరో 11 పూర్తి చేశారు. ఇంకో నాలుగు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
-దుబ్బాక మున్సిపాలిటీలో 28 సౌచాలయాలు ఉం డాల్సి ఉండగా, ప్రస్తుతం 12 మరుగు దొడ్లు ప్రజలకు అం దుబాటులో ఉన్నాయి. ఇటీవలే మరో నాలుగింటిని పూర్తి చేశారు. మిగతా 12 వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
-జిల్లా కేంద్రం సిద్దిపేట లో 117 సౌచాలయాలు ఉం డాల్సి ఉండగా, ప్రస్తుతం 84 మరుగు దొడ్లు ప్రజలకు అం దుబాటులో ఉన్నాయి. ఇటీవలే మరో పదింటిని పూర్తి చేశా రు. మిగతా 23 వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
ఇందులో సగం వరకు మున్సిపాలిటీలు పట్టణ ప్రగతి నిధులతో నిర్మిస్తుండగా, మిగతా వాటిని ప్రయివేటు భాగస్వామ్యం(బీఓటీ)తో నిర్మాణాలు చేపడుతున్నారు. మహిళల జనాభాకు సరిపడా మరుగు దొడ్లు నిర్మిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ప్రత్యేక చొరవతో....ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు జిల్లాలోనీ పురపా లిక లలో సామూ హిక మరుగుదొడ్లు పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇవి అందుబాటులోకి వస్తే పట్టణ వాసులకే కాకుండా, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతగానో సౌల భ్యంగా ఉంటుంది. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో అధికారులు నిర్మాణాలను వేగవంతం చేశారు.
ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో పట్టణాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వారు సూచించిన విధంగా నిబంధనల మేరకు అన్నింటినీ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం నిబంధనల మేరకు ఉండాల్సిన వాటి కంటే ఎక్కువగానే ఉంటాయి.
-శ్రీనివాస్ రెడ్డి, పురపాలక కమిషనర్, సిద్దిపేట.