Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-తహశీల్దార్ మనోహర్చక్రవర్తి
నవతెలంగాణ-నర్సాపూర్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండిపెట్టాలని తహశీల్దార్ మనోహర్చక్రవర్తి మధ్యాహ్న భోజన కార్మికులకు, ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం నర్సాపూర్ మండల పరిధిలోని మూసపేట్ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలను సొంత పిల్లలుగా చూసుకునే బాధ్యత ఉపాధ్యాయులదేనని గుర్తుచేశారు. మూసపేట పాఠ శాల స్వచ్ఛ పాఠశాలగా ఎంపికైనందున ఉపాధ్యాయులను అభినం దించారు. కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ సర్పంచ్ అన్నం జంగమ్మ, మల్లేష్యాదవ్, పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్రావులు పాల్గొన్నారు.