Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్కు వినతిపత్రం అందజేసిన సంఘం నాయకులు
నవతెలంగాణ-కొల్చారం
బంజారా భేరి నూతన భవన నిర్మాణానికి మండల కేంద్రమైన కొల్చారంలో స్థలం కల్పించాలని బుధవారం ఆ సంఘం నాయకులు తహశీల్దార్ జి. రమేశ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం చర్చించుకోవడానికి ఇప్పటి వరకూ ఆ సంఘానికి భవనం లేదన్నారు. తక్షణమే వారికి భవన నిర్మాణం కోసం స్థలం సేకరించి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బంజారా భేరి మండల అధ్యక్షుడు రాంఛందర్ నాయక్, జనరల్ సెక్రటరీ వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.