Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎల్ఐసీ ఆధ్వర్యంలో పాఠశాలకు వాటర్ ఫిల్టర్
నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామ జడ్పీహెచ్ఎస్లో లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎల్ఐసీ సికిందాబాద్ డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ రమేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామస్తులు అనేక సార్లు ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, దానికి స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ సిద్దిపేట బ్రాంచ్ మేనేజర్ ఏఎస్ఆర్ శర్మ, గజ్వేల్ బ్రాంచ్ మేనేజర్ అల్లి మహేందర్, గజ్వేల్ డవలప్మెంట్ మేనేజర్ ఈశ్వర్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరీమొద్దిన్, మండల కోఆప్షన్ సభ్యులు అహ్మద్, టీఆర్ఎస్ నాయకులు రమేశ్, తదితరులు పాల్గొన్నారు.