Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సాపూర్
నర్సాపూర్ మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మండల కమిటీని బుధవారం పట్టణంలోని ఆదిలక్ష్మినర్సింహాస్వామి ఆలయంలో నిర్వహించిన మండల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా కె.కృపాచారి, ఉపాధ్యాక్షులుగా వి.రాంచంద్రంచారి, బ్రహ్మయ్యచారి, ప్రధాన కార్యదర్శిగా వి.నర్సింహాచారి, సహాయ కార్యదర్శిగా కమ్మరి లక్ష్మణ్చారి, వడ్ల పద్మ, కోశాధికారిగా వడ్ల నర్సింహాచారీ, ప్రధాన సలహాదారులుగా కమ్మరి శ్రీనివాస్చారీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీసభ్యులు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఎదురుకుంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఏకతాటిపై ఉండి సమస్యలను పరిష్కరించుకునేవిధంగా భవిష్యత్తులో పోరాటం చేయాలన్నారు.