Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సిద్దిపేట టౌన్
సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో ముందంజలో నిలుపాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాల యంలో హోం కంపోస్టింగ్ డెవలప్మెంట్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీలో హోమ్ కంపోస్టింగ్ డెవలప్మెంట్ చేయడంలో సీఓలు, ఆర్పీలు, మహిళా గ్రూప్ సభ్యులు ముందుకాస్తున్నారని అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో హోం కంపోస్టింగ్ స్టాలో ఏర్పాటు చేయడం జరిగినదని, ముందుగా సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది అందరూ కొనుగోలు చేస్తున్నారన్నారు. హౌమ్ కంపోస్టింగ్ను సిద్దిపేట పట్టణ ప్రజలు కూడా వారి వారి ఇండ్లలో మొదలు పెట్టి సిద్దిపేట పట్టణాన్ని మొదటి స్థానంలో నిలుపుదామని పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ డీఈ గోపాల్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, టీఎంసీ సాయికష్ణ, సీఓలు, ఆర్పీలు, మహిళా గ్రూపు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.