Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సిద్దిపేట ప్రతినిధి
సిద్దిపేట ప్రజల పక్షాన నిలుస్తూ నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు హరీశ్రావు అని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వంగ నాగిరెడ్డి కొనియాడారు. శనివారం మంత్రి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా డైరెక్టర్ ముత్యాల కనకయ్య, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్యయాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వంగ తిరుమల్రెడ్డి, హరీషన్న సైన్యం రంగధాంపల్లి శ్రీను, అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కొండపాక : అత్యధిక మెజార్టీతో గెలిచి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రికార్డులు సృష్టించిన ఘనత హరీశ్రావుకే దక్కుతుందని మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య అన్నారు. శనివారం హైదబాద్లోని తన నివాసంలో గృహంలో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక మండలం సీఎం కేసీఆర్కు అత్యధిక మెజారిటీ అందించడంలో కషిచేసిన మీ అందరికీ కతజ్ఞతలు తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ మంచాల శ్రీనివాస్, కుకునూరుపల్లి మాజీ సర్పంచ్ నవీన్కుమార్, కృష్ణమూర్తి, బుద్ధి రాములు, పాండు, ప్రశాంత్గౌడ్, మహిపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.