Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేర్యాల
భాస్కర్రెడ్డి మృతి ఉపాధ్యాయ సంఘానికి తీరని లోటని సంఘం పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, కొత్త నరేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పెద్దమ్మగడ్డ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘానికి చెందిన గొట్టం భాస్కర్ రెడ్డి అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందగా శనివారం పీఆర్టీయూ మండల కమిటీ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సానుభూతి తెలిపిన వారిలో సంఘం మండలాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.శ్రీనివాస్రెడ్డి, పెరక రాజయ్యతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.