Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శివ్వంపేట
నర్సాపూర్ ఎమ్మెల్యేగా మదన్రెడ్డి గెలుపొందితే కాలినడకన తిరుపతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటానని మొక్కుకున్న కౌడిపల్లికి చెందిన టీఆర్ఎస్ జిల్లా నాయకులు చిలుముల నర్సింహారెడ్డి పాదయాత్ర శనివారం మండలంలోని గోమారం గ్రామానికి చేరుకుంది. పార్టీ శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న నర్సాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపట్లోరి మాధవరెడ్డి ఆయన మద్దతుదారులతో కలసి పాదయాత్ర చేస్తున్న నాయకులకు స్వాగతం పలికారు. గోమారం గ్రామం శివారు బిజిలీపూర్ చౌరస్తా వరకు నాయకుల వెంట వారు పాదయాత్రగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు సుధీర్రెడ్డి, గ్రామక మిటీ అధ్యక్షులు శ్రీధర్రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్రెడ్డి, నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, నాగరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.