Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీఈఓ సిద్ధయ్య
నవతెలంగాణ-వెల్దుర్తి
రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం ఆదేశాల మేరకు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సహకార సంఘం ఆధ్వర్యంలో ఓటరు జాబితాను సవరణ జరుగుతుందని శనివారం విలేకరులతో సీఈఓ సిద్ధయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత ఖాతాదారుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఓటరు జాబితాలో ఉన్న పేర్లు గానీ, ఫొటోలు గానీ, తప్పులు ఉంటే ఈ నెల 20వరకు సవరణ చేసుకోవచ్చని అన్నారు. సహకార సంఘంలో సభ్యులై ఉన్నవారు సహకార సంఘం కార్యక్రమంలో సంప్రదించాలని సూచించారు.