Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగా-హవేళిఘనపూర్
టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తనూ ఆదుకుంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కూచన్పల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మన్నె హనుమంతు గతంలో పాముకాటుతో మృతి చెందాడు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్త మరణానికి రూ.2 లక్షల బీమా చెక్కును ఆయన శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు చూసే ప్రజలు భారీ మెజార్టీతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చారన్నారు. గతంలో ఏ మాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వేగంగా అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జడ్పీటీసీ లావణ్య రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కొత్తపల్లి కిష్టయ్య మాజీ సర్పంచులు దేవా గౌడ్, మహేందర్ రెడ్డి, కిష్టాగౌడ్, రమేష్ గౌడ్, బయన్న, రామయ్య తదితరులు పాల్గొన్నారు.