Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామాయంపేట (నార్సింగి)
లయన్స్ క్లబ్ స్నేహ బంధు ఆధ్వర్యంలో నార్సింగి మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శనివారం పంచా యతీ కార్యాలయంలో మేడ్చల్కు చెందిన మెడిసిటి ఆస్పత్రి సహకారంతో చెవి, ముక్కు, గొంతుతో పాటు ఇతర రోగులకు పరీక్షలు చేసి తగు మందులు అందజేశారు. అవసరమైన వారికి ఈ నెల 27న మేడ్చల్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సలు నిర్వహిస్తామన్నారు. ఈ శిబిరంలో సుమారు 125 మంది రోగులకు చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్క్లబ్ అధ్యక్షుడు వలిశెట్టి సత్యనారాయణ, కార్యదర్శి ఐరేని రవీందర్గౌడ్, కోశాధికారి దీప్చంద్, డీసీలు బాదె గురువయ్య, దామోదర్రావు, సభ్యులు సార్గు లక్ష్మణ్, బోండ్ల శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు.