Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజ సేవలో మురళీకృష్ణ ముందు
- సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీ నారాయణ
నవతెలంగాణ- సిద్దిపేట టౌన్
సమాజానికి సేవ చేయడంలో సిద్దిపేట పట్టణానికి చెందిన సింగోజు మురళీకష్ణ ఆచార్యులు ఎల్లవేళలా ముందుంటారని హైకోర్టు న్యాయవాది, బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ అన్నారు. సమాజం పట్ల అంకిత భావంతో పనిచేసే వారిని ప్రోత్సహించడానికే బీసీ బహుజన సంక్షేమ సంఘం తరపున మురళీకృష్ణచార్యులకు సత్కారం చేసు న్నామన్నారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో బీసీ బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బెస్ట్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అవార్డు గ్రహీత సింగోజు మురళీకష్ణ ఆచార్యులను సన్మానించి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సంపత్తో కలిసి వారు మాట్లాడారు. సమాజ సేవ చేయడంలో అన్నివేళలా ముందుండే మురళీకష్ణకు ఈ అవార్డు రావడం మంచి గుర్తింపును ఇచ్చిందన్నారు. ఇకముందు కూడా ఇలాగే సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించారు. అవార్డు గ్రహీత మురళీకష్ణ మాట్లాడుతూ తనకు అవార్డు వచ్చిన సందర్భంగా సన్మానం చేసిన బీసీ బహుజన సంక్షేమ సంఘం ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసూరి ఎల్లయ్య, భాగ్యరేఖ, కష్ణ చారి, రవీందర్, హరీష్ పలువురు పాల్గొన్నారు.