Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేట టౌన్
సమాజానికి సాహిత్యం దిశానిర్దేశం చేస్తుందని సిద్దిపేట జిల్లా రచయిత సంఘం (సిరసం) జిల్లా అధ్యక్షులు అమ్మన చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సిరసం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాన్ని మార్చే గొప్ప శక్తి సాహిత్యానికుందన్నారు. అందుకుగానూ కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, కవితా గోష్టుల ద్వారా సాహిత్య మాధ్యమంగా మంచి సందేశం అందించాలన్నారు. మహిళా డిగ్రీ కళాశాల ఉపన్యాసకురాలు డా.సామ సువర్ణాదేవి మాట్లాడుతూ కవులు సాహిత్య సృజన చేసి మార్గదర్శకులు కావాలన్నారు. అనంతరం కవి పెందోట వెంకటేశ్వర్లు రచించిన మర్కూక్ మాణిక్యాలు అను బాలసాహిత్య పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. కవి మిట్టపల్లి పర్షరాములు పుస్తక సమీక్ష చేశారు. కవి సమ్మేళనంలో కవులు సమకాలీన సమస్యలను ఊటంకిస్తూ ఆధ్యంతం సభను అలరింపజేశారు. కార్యక్రమంలో కవులు డా.కాపు రమేశ్, డా.వాసరవేణి పర్షరాములు, పప్పుల రాజిరెడ్డి, మచ్చ అనురాధ, సామలేటి లింగమూర్తి, రాంచంద్రామూర్తి ఉన్నారు.