Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపోల్
పల్లె ప్రగతికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సిద్ధిపేట జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పల్లె ప్రగతి, డంపింగ్ యార్డ్, శ్మశానవాటిక, హరిత హరం, ఉపాధి హామీ పనుల పురోగతిపై స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల జిల్లా, డివిజన్, మండల అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలు గ్రామాలలో క్షేత్రస్థాయిలో అనుకున్న మేర పల్లెప్రగతి నడవట్లేదని స్పష్టం చేశారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేయాలన్నది పల్లెప్రగతి కాదని ఆలోచన సరికాదన్నారు. డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్మించారు కానీ, వాటిని వాడుకలోకి తేలేదని ఇప్పుడు లాభం ఏమిటన్నారు. పంచాయతీలకు సొంత నిధులు, ప్రభుత్వ నిధులు, ఈజీఎస్ ఇలా మూడు రకాలుగా నిధులు వస్తాయని, ఈజీఎస్ నిధులతో పనులను పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో చేయిస్తున్నామని వివరించారు. గ్రామ అభివద్ధి కమిటీ- వీడీసీ కమిటీలతో చర్చించి నిధులను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాలలో రైతు కల్లాలు, రైతు వేదికలు నిర్మాణాలు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
ఏంపీఓ- మండల ప్రత్యేక అధికారి కనీసం రోజుకు 5 గ్రామాలు తిరగాలని, తిరుగుతున్నారా లేదా అని చూడాల్సిన భాధ్యత డీపీఓకు ఉందన్నారు. ప్రజల అభీష్టం మేరకు పనులు జరుగుతున్నాయా లేదా చూడాల్సిన భాధ్యత ఎంపీఓలకు ఉందన్నారు. ఏంపీఓలకు కార్యాలయంలో కుర్చీయే అవసరం లేదన్నారు. ప్రతీ 4 రోజులకు ఒక్కసారి గ్రామ పంచాయితీలకు తప్పనిసరిగా వెళ్లాలని, ఉదయం 7 నుంచి గ్రామాలలో తిరగాలన్నారు. ఎంపీడీఓల భాధ్యతలు కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పూర్తిగా స రళీకరించబడ్డాయని, ఆఫీసు కార్యాలయాల్లోనే కూ ర్చోకుండా ప్రజలలో ఉండాలన్నారు. రోజుకు 8 గంటలు గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాల్సిందేనని ఆదేశించారు. డ ంప్షెడ్డులు వినియోగంలోకి తీసు కురాకపోతే ఆయా పంచాయితీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్లు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. 15 రోజులలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, గ్రామంలో అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీవో, ఎంపీఓ, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో 8 గంటలు పర్యటిస్తూ పారిశుధ్యం, హారితహరంతో పాటు ఉపాధి హామీ పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. కార్యదర్శి ఉదయం 7.30 గంటలకే క్షేత్ర స్థాయిలో ఉండాలన్నారు.
అనంతరం కలెక్టర్ గ్రామాల వారీగా మండల అభివద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. పంచాయతీల నుంచి ట్రాక్టర్కు, డీజిల్కు నిధులను వాడవద్దని ఆదేశించారు. గ్రా మాలలో ప్రతి పనికి ఉపాధి హామీ పథకంను అనుసంధానం చేయాలన్నారు. ట్రాక్టర్ డీజిల్, డ్రైవర్ ఖర్చులు సైతం ఉపాధి హామీ పథకం క్రింద చెల్లించే సౌలభ్యం ఉన్నందున ఆదిశగా చ ెల్లింపులు చేయాలన్నారు. డంప్ షెడ్లో వ్యర్థాలను విభజన చేసేందుకు నలుగురినిఉపాధి హామీ పథకంలో ని య మించుకోవాలన్నారు. శ్మశానవాటిక, డంప్షెడ్లలో మొ క్కలను పెంచే బాధ్యతలను సైతంవారికి అ ప్ప గించాలన్నారు. అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, డీపీఓ సురేష్బాబు, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఏపీడీ కౌసల్యాదేవి, డీఎల్పీవో నాగరాజు, మండల ప్ర త్యేక అధికారి వెంకటరమణ, ఎంపీడీవో మేరీ స్వర్ణకుమారి, ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, రైతుబంధు సమితి అధ్యక్షులు మున్నా,స్థానిక సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి, ఆయా శాఖల మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.