Authorization
Sat March 15, 2025 12:18:15 am
నవతెలంగాణ-అచ్చంపేట రూరల్
మండల పరిధిలోని ఉమామహేశ్వర క్షేత్రంలో పెను ప్రమాదం తప్పిం ది. ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్ వివరాల మేరకు మంగళవారం ఉద యం 5గంటల సమయంలో ఉమామహేశ్వర ఆలయం పార్కింగ్ ఆవరణలో గల వాటర్ ట్యాంక్ సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. సుమారు 150 కిలోల బరువు ఉన్న పెద్ద రాళ్లు రోడ్డుపై పడ్డాయన్నారు. కాగా ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గాని జరగలేదని తెలిపారు.