Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -వనపర్తి
వరి కొనుగోలు కేంద్రంలను వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్కు తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్రెడ్డి, కార్యదర్శి పరమేశ్వర మాట్లాడుతూ జిల్లాలో వనపర్తి, గోపాల్ పేట, ఘనపూర్, పెద్దమందడి, పెబ్బేరు ఇతర మండలాలలో వరి పంట చేతికొచ్చి కొనుగోలు కేంద్రాల్లో రోడ్లపై రైతులు ఆరబెట్టుకుని గత 15, 20 రోజుల నుండి వేచి చూస్తున్నా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని వివరించారు. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే కొనుగోలు చేయాలని జెసికి విన్నవించారు. జెసి స్పందిస్తూ వెంటనే ప్రారంభించే విధంగా ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి పాల్గొన్నారు.