Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ- మహబూబ్ నగర్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మౌలానా ఆజాద్ ఫెలోషిప్స్ ను వెంటనే రద్దు విరమించ ుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహకార దర్శి రాజు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక టీటీడీ ధర్నా చౌక్ వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వ ర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మౌలానా ఆజాద్ పేరిట 1989లో ప్రారంభమైన మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఫిలోషిప్స్ రద్దు చేయడం సరికాదన్నారు. మైనార్టీ లైన ముస్లిం, క్రిస్టియన్స్, బుద్ధాస్, సిక్కు, పార్సి, జైనీస్ రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులకు నెలకు 35 వేల రూపాయల అందించడం జరుగుతుందని వారు తెలిపారు. మైనార్టీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఫిలోషిప్స్ను రద్దు చేయడం పేద విద్యార్థులకు నష్టం చేయడమే అవుతుందన్నారు. మైనార్టీ శాఖ మినిస్టర్ స్మృతి ఇరానీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం మతోన్మాద పార్టీ అని మరోసారి నిరూపించుకుందన్నారు. రద్దు చేసిన ఫిలోషిప్ వెంటనే అమలు చేయాలని లేనియెడల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కే.లక్ష్మణ్, జిల్లా నాయకులు కృష్ణ రాజేష్ రాజశేఖర్ ఉపేష్ తదితరులు పాల్గొన్నారు.