Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఈఓ మంజుల దేవి
నవతెలంగాణ -మిడ్జిల్
మన ఊరు మన బడిలో పనులను త్వరగా పూర్తిచేయాలని ఎంఈఓ మంజుల దేవి ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించాలని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం మెను ప్రకారంగా అందించాలని వంట ఏజెన్సీలకు సూచించారు. అనంతరం విద్యార్థుల హాజ రు పట్టిక, ఉపాధ్యాయుల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింహులు, విజయభాస్కర్ పాల్గొన్నారు.