Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాల :
మండల పరిధిలోని సూరాపూర్ గ్రామంలో ఉన్న రైతులకు శుక్రవారం మండల వ్యవసాయ అధికారి నాగార్జునరెడ్డి విత్తనోత్పత్తిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు శుద్ధి చేసిన విత్తనాలనే విత్తుకొని పంటలు పండించాలన్నారు. ఈ రకంగా చేసుకుంటే పంటల దిగుబడి బాగా వస్తుందన్నారు. ప్రస్తుతం వానకాలంలో వేసుకున్న మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు యూరియా, ఎరువులు ఎంతో అవసరం ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సింగిల్ విండో బ్యాంకు ద్వారా రైతులకు యూరియా సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 480 బస్తాల యూరియా ఉందన్నారు. పంటలకు యూరియాను ఎక్కువగా వాడకుండా మోతాదులో వాడాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజశేఖర్రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.