Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నల్లవెల్లి రాజేందర్
నవతెలంగాణ- కొల్లాపూర్
గ్రామాల్లోకి వచ్చే బస్సులు సమయపాలన పాటించి బస్సులు నడపాలని -డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నల్లవెల్లి రాజేంధర్ అధికారులను కోరారు. బస్ డిపోలో సీఐ సైదులుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ... ముక్కుడి గుండె, నార్లాపూర్, జేమ్యానాయక్ తండా, వడ్డెగుడిసెలు, బోరబం డ తండా, ఎల్లురు గ్రామం నుంచి రోజు వారిగా అవసరాల నిమిత్తం కొల్లాపూర్కు వెళ్లేవారన్నా రు. గ్రామాలకు బస్సు సమయ పాలన పాటించకపోవడంతో అవస్థలు పడుతున్నార న్నారు. బస్సులు ఉదయం 8గంటల నుంచి సాయం కాలం 7 గంటలకు ఒక ట్రిప్పు నడపా లని ప్రతి రోజూ సమయ పాలన పాటించి బస్సులు నడిపితే ఆటోలో వెళ్లే వారు తగ్గుతార ని తెలిపారు. ఉదయం 6గంటలు, 8, 10 గంటలు, సాయంకాలం 5, 7 గంటలకు నడపా లనివారు కోరారు. ఈ కార్యక్రమంలో మణినా యక్, రాములు, నరేష్, శంకర్, మల్లయ్య ,రాజు, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.