Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోస్గి
రైతులకు వచ్చే ఏడాది నుంచి ఎకరాకు నాలుగువేల రూపాయలు టీర్ఎస్ అందిస్తున్నందున ఇంటింటి భూ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వీఆర్ఏ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని అమ్లికుంట గ్రామంలో సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు భూములకు సంబందించిన వివరాలన్నీంటినీ ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతుల పేర్లు నమోదు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ రైతులు ఉన్నారు.