Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ శాఖ ఈఈ రమణమూర్తి
నవతెలంగాణ-కల్వకుర్తి
పట్టణంలోని పశువుల సంత వద్ద నిర్మిస్తున్న నగర పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాన్ని నాణ్యతగా సకాలంలో పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ కృషి చేయాలని మున్సిపల్ శాఖ ఈఈ రమణమూర్తీ అన్నారు. శుక్రవారం పట్టణంలోని భవన నిర్మాణ పనులను డీఈ రియాజుద్దిన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించిన వివరాలను ఏఈ బిక్కునాయక్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈఈ మాట్లాడుతూ... భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించక పోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పనినీ ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఏఈని ఆదేశించారు. దాదాపు రూ.కోటి 60లక్షలతో నిర్మిస్తున్న భవనం నాలుగు కాలాల పాటు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ప్రతి పనినీ క్వాలిటీ కంట్రోల్ అధికారులతో ఆదేశిస్తామని వెల్లడించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. పనులు ప్రారంభించి ఆరు నెలలు కావస్తున్నా బేస్మెంట్ లెవల్ వరకూ ఉండటం ఏమిటని కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. ఇకపై పనులను వేగవంతంగా చేపట్టాలని ఆయన కోరారు. ఆయన వెంట నగర పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.