Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాల :
ఐదు నుంచి 15 ఏండ్ల వయసు పిల్లలకు రుబెల్లా టీకాను తప్పని సరిగా వేయించాలని ఎంఈఓ పాండు అన్నారు. లింగాలలో, కొత్తకుంటపల్లి తదితర గ్రామాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న చిన్నారులకు శుక్రవారం రుబెల్లా టీకాలను వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ టీకా వల్ల తట్టు తదితర వ్యాధులు రాకుండా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ పాండు, పద్యజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
పెంట్లవెల్లి:మండలంలోని ప్రాథమిక పాఠశా లలో శుక్రవారం వైద్య సిబ్బంది తట్టు రుబెల్లా వ్యాధుల నివారణకు టీ కాలు అందజేశారు. ప్రాణాంతకమైన తట్టు రుబెల్లా నుంచి పిల్లలను కాపాడాలని ఏఎన్ఎం మంత్రి బాయి తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు శివలీల, వెంకటమ్మ, వరలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యా యులు రాజమన్సింగ్, విద్యార్థులు పాల్గొన్నారు