Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొల్లాపూర్ రూరల్
కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారుల స్క్వాడ్ బృందం శుక్రవారం తనిఖీ చేశారు. కొల్లాపూర్లోని శబరి ఫర్టిలైజర్, శ్రీనివాస, మన గ్రోమోర్, పెంట్లవెల్లిలోని సత్యనారాయణ అండ్ సన్స్ మరియు రామకృష్ణ ఎరువుల దుకాణాలు తనిఖీ చేసినట్టు వ్యవసాయాధికారి నాగరాజు తెలిపారు. ఆయా దుకాణాలల్లో ఎరువులను, మందుల రకాలు షాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు పంపినట్టు ఆయన తెలిపారు. ఈ తనిఖీలో కొల్లాపూర్ ఏడీఏ రవికుమార్, వంగూర్ ఏఓ తనూజ, వెల్డండ ఏఓ మంజుల పెంట్లవెల్లి ఏఓ నరేష్లు పాల్గొన్నారు.