Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉప
తహశీల్దార్కు వినతి
నవతెలంగాణ-కల్వకుర్తి
జిల్లా మైనార్టీ వెల్పేర్ అధికారి సప్తగిరి అవినీతి అక్రమాలకు పాల్పడున్నారని, ఆయనపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఉప తహశీల్దార్కు వినతిపత్రం అందించారు. విద్యార్థులకు గుడ్లు, చికెన్ అందించే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నాడని వినతి పత్రంలో పేర్కొన్నారు. నాగర్కర్నూల్లో సదరు కాంట్రాక్టర్లతో ఈ నెల 16వ తేదీన మద్యం తాగుతూ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. విద్యార్థులకు నష్టం చేస్తూ వారి పొట్టగొడుతున్న అధికారులపై కలెక్టర్ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అవినీతి అధికారిపై చర్యలు తీసుకోని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వారు హెచ్చరించారు.