Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనిచేయని సోలార్ లాంతర్లు
- చీకట్లో మగ్గుతున్న చెంచులు
- తాగునీటి వసతి కరువు
- ఆరేండ్ల క్రితం 16 సోలార్ కిట్లు ఏర్పాటు
ఒక చోటి నుండి మరో చోటికి వెళ్లాలంటే దారి కరువు
అసలే నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం. పులులు, ఎలగొడ్లు వంటి క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అటవీ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అవి ఎప్పుడు దాడి చేస్తాయో తెలీదు. ఇక రాత్రి పూట ప్రయాణం చేస్తే ప్రాణాలు దక్కుతాయో లేదోననే భయం. కొండా కోనల నడుమ ఆవాసాలు ఏర్పాటు చేసుకుని చెంచులు వందేండ్ల నుండి జీవిస్తున్నారు. అటవీ ప్రాంతంలో చెంచుల కోసం ఆరేండ్ల క్రితం సోలార్ కిట్లు ఏర్పాటు చేశారు. కానీ అవి మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. ప్రస్తుతం అవి పని చేయక పోవడంతో రాత్రిపూట బయటికి రావాలంటే చెంచులు భయ పడుతున్నారు.
నవతెలంగాణ-మహబూబ్నగర్ప్రతినిధి
అచ్చంపేట, కొల్లాపూర్ వనపర్తి నియోజ కవర్గాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం గుర్తించిన చెంచుపెంటలు 76 ఉన్నాయి. అక్కడక్కడ 100కు పైగానే గూడాలున్నాయి. సుమారు 7600 మంది చెంచులు ఉన్నారు. పదేండ్ల క్రితం ఈ సంఖ్య 12 వేలకు పైగానే ఉండేది. ప్రస్తుతం కొంతమంది వలస పోవడం, మరికొందరు చనిపోవడం, తదితర కారణాలతో వారి సంఖ్య భారీగా తగ్గింది. వీరంతా నల్లమలనే ఆసరాగా చేసుకొని అప్పాపూర్, వటవర్లపల్లి తదితర ప్రాం తాల్లో జీవిస్తున్నారు. అప్పాపూర్ పూర్తిగా దట్టమె ౖన అటవీ ప్రాంతంలో ఉంది. శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి 40 కిలోమీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంది. రహదారులు కూడా సరిగా లేవు. వీరికి తాగునీటితో పాటు కనీస వసతు లూ లేవు. ఈర్లపెంట కూడా ఎత్తైన కొండా కోనల్లో ఉంది. చీకటి పడిందంటే చాలు బయటకు రావాలంటే భయపడతారు. చెం చుపెంటల్లో వెలుగుల నింపడానికి ప్రభుత్వం ఆరేండ్ల క్రితం 16 సోలార్ కిట్లు ఏర్పాటు చేశారు.ఒక్కో దానికి రూ.15 లక్షల దాకా ఖర్చు చేశారు. కానీ వీటి నిర్వహణ సరిగా లేక అవి ప్రస్తు తం మూలకు పడిపోయాయి.
అవస్థల్లో చెంచుపెంటలు
చెంచుపెంటలు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడు తున్నారు. ముఖ్యంగా ఒక పెంటనుంచి మరో పెంటకు వెళ్లడానికి రహదారులు లేవు. గుండ్లు, ఎత్తైన కొండల మీదినుంచి వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సార్లు రాళ్ల ్లమీది నుంచి జారి పడి చనిపోయిన సంద ర్భాలూ ఉన్నాయి. వర్షం వస్తే చాలు చెంచుపెంటలన్నీ వణికిపోతాయి. చెంచులుండే ప్రాదేశాలన్నీ పూర్తిగా గుంతలమయంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షకాలంలో బురదనీళ్ల మధ్యనే జీవనం సాగిస్తుం టారు. వీరికోసం ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లతో పాటు ప్రాథమిక చికిత్సా కేంద్రాలు మున్నాళ్ల ముచ్చ టగా మారాయి. వీటిని మరమ్మతు చేసే దిక్కు లేక కిట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.
చెంచుల నిధులంటేనే ఆటవిడుపు
చెంచుల కోసం నిధులు వస్తే చాలు అధికారులు మొదలుకొని నాయకులదాకా అటవిడుపుగా ఉంటుం ది. అక్షరజ్ఞానం లేని చెంచులతో సంతకాలు చేయిం చుకొని పంపిణీ చేసినట్టుగా లెక్కలు చూపుతారు. ము ఖ్యంగా ఐదేండ్ల క్రితం చెంచులకోసం 150 డేరాలిచ్చారు. వీటిలో 15 మందికి మాత్రమే పంపిణీ చేసి మిగతా వాటిని అధికారులు పక్కదారి పట్టించి నట్టు ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ, ఐఏఐ పథకాల కింద అప్పాయిపల్లిలో 76 ఇండ్లు మంజూరు చేసినట్టు లెక్కలు చూపుతున్నారు కానీ ప్రస్తుతం పది ఇండ్లకు మించి అక్కడ నిర్మాణం చేయలేదు. ఇంకా గేదెలు, గొర్రెలు 26 మంది ఇచ్చినట్లు లెక్కలున్నాయి. పండ్ల తోటల పెంపకానికి కూడా మాడా తరుపున నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో ఏ ఒక్కటీ చేరిన దాఖల ాలు లేవని పలు ప్రజాసంఘాల నాయకులు చెబుతున్నారు.
వెలుతురు ఏర్పాటు చేయండయ్యా
మాకు చందమామ ఉంటేనే వెలుతురు ఉంటుంది. రాత్రి పూట అటవీ జంతువులతో కష్టంగా ఉంది. అటవీ ప్రాంతంలో వెలుతూరు కోసం లైట్లు ఏర్పాటు చేయాలి. అడవిలో ఉంటున్న మమ్ములను జంతువుల మాదిరిగా చూస్తున్నారు. నాయకులు వస్తారు హామీలు ఇస్తారు కానీ ఒక్కటీ అమలు కాదు. వానా కాలంలో తడుస్తాం. చలికాలంలో వణుకుతాం. ఎండాకాలంలో తిండిలేక చస్తాం ఇది మా చెంచుల పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా తల రాతలు మార్చాలి.
పెద్ద మల్లయ్య, అప్పాపూర్