Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వ్యవసాయ రసాయనాల రంగంలోని ఆగ్రో లైఫ్ లిమిటెడ్ దేశంలోనే తొలిసారి డిరోన్ (డైనోటెఫురాన్ 20శాతం ఎస్జి) పురుగు మందు తయారీకి లైసెన్స్ పొందినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ సూపర్ సిస్టమాటిక్ పురుగుమందు తెగుళ్ళ యొక్క విస్తత వర్ణపటాన్ని నియంత్రిస్తుందని పేర్కొంది. దీనిని వరి, పత్తిలో వేరువేరుగా ఉపయోగించడానికి ప్రత్యేక వేరియంట్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్పత్తి పలు జపనీస్ పురుగుమందుల దిగుమతిలో ప్రత్యామ్నాయం కానుందని ఆ కంపెనీ డైరెక్టర్ విమల్ కుమార్ పేర్కొన్నారు. దీని ద్వారా రైతులకు అధిక ఆదాయం, లాభదాయకత పెరుగుతుందన్నారు. ఈ కొత్త ఉత్పాదన వల్ల తమ కంపెనీ రెవెన్యూ మరో రూ.100 కోట్లు పెరుగొచ్చని అంచనా వేశారు.