Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యూరోపియన్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ థామ్సన్ కొత్తగా పాత్ సీరిస్లో టీవీలను ఆవిష్కరించినట్టు తెలిపింది. 32 నుంచి 43 అంగుళాల వరకు కలిగిన వీటి ధరల శ్రేణీని రూ.10,999 నుంచి 99,999గా నిర్ణయించినట్టు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి మేక్ ఇన్ ఇండియా సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలని.. వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాలను తీర్చేలా పాత్ సీరిస్ను రూపకల్పన చేసినట్టు పేర్కొంది. రాబోయే ఐదేండ్లలో ఆండ్రాయిడ్ టీవీ తయారీని గరిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. ఈ టీవీల ఆవిష్కరణతో 2021-22 ముగింపు నాటికి 7 శాతం మార్కెట్ వాటాను అంచనా వేస్తున్నట్టు తెలిపింది.