Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగం లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) లాభాలు మూడు రెట్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ. 843.60 కోట్ల నికర లాభాలు సాధించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో రూ.242.60 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.11,526.95 కోట్ల మొత్తం ఆదాయం నమోదు కాగా.. గడిచిన త్రైమాసికంలో రూ.11,941.52 కోట్లకు చేరింది. బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 16.50 శాతం నుంచి 13.91 శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో నికర ఎన్పిఎలు 5.79 శాతం నుంచి ఏకంగా 3.58 శాతానికి దిగివచ్చాయి.