Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తైవాన్కు చెందిన సాంకేతిక సంస్థ, అసుస్ రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (రోగ్) భారత మార్కెట్లోకి కొత్త జెఫిరస్ జి14 లాప్టాప్ను విడుదల చేసినట్లు తెలిపింది. అత్యాధునిక ఎఎండి రైజెన్ 9 4900హెచ్ఎస్ ప్రాసెసర్, 8కోర్స్, 16 త్రెడ్స్తో దీన్ని ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఇది శక్తివంతమైన పనితీరును అందిస్తుందని, 100శాతం ఎస్ఆర్జిబి కలర్ ఖచ్చితత్త్వం కలిగిన డిస్ప్లేను కలిగి ఉందని తెలిపింది. వీటి ధరలను రూ.80,990, రూ.98,990గా నిర్ణయించినట్టు పేర్కొంది.