Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో రూ.9 కోట్లతో ప్లాంట్
హైదరాబాద్ : హే టుమారో కన్జూమర్ ప్రోడక్ట్స్ సంస్థ పళ్లు, కూరగాయలను శుభ్రపర్చుకోవడానికి వీలుగా 'హేడెన్' పేరుతో ద్రావణాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ద్రావణం కంటికి కనిపించకుండా ఉండే క్రిములు, పురుగు మందుల అవశేషాలు, ఇతరత్రా మలినాలను 99.9 శాతం వరకు పోగొట్టగలుగుతుందని ఆ కంపెనీ డైరెక్టర్ అనిత నల్లపాటి తెలిపారు. దీనిని సహజ సిద్ధ వనరుల నుంచి తయారు చేశామన్నారు. హేడెన్ 500మిల్లీ లీటర్ల బాటిల్ రూ.279గా, 200 ఎమ్ఎల్ బాటిల్ రూ.135గా నిర్ణయించామన్నారు. ఇవి రిటైల్, ఆన్లైన్ స్టోర్లలో లభ్యమవుతాయన్నారు. రూ.9 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ని నిర్మించబోతున్నామని.. వచ్చే ఏడాది ఇది రెడీ అవుతుందని ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ మోనికా రావిళ్ల తెలిపారు.