Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచ అగ్రగామి ఇంటర్నేషనల్ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్ అయిన డీ హెచ్ఎల్ ఎక్స్ ప్రెస్ నేడిక్కడ రేట్ల పెంపును ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. 2020తో పోలిస్తే భారతదేశంలో ఈ పెంపు 6.9% గా ఉండనుంది. అంతేగాకుండా ఓవర్ వెయిట్ పీసెస్ మరియు నాన్-స్టాకబుల్ పాలెట్స్ కు వరుసగా ఒక్కో పీస్ కు రూ.7,250 మరియు ఒక్కో పాలెట్ కు రూ. 15,000 లకు సర్దుబాటు చేస్తారు. నెట్ వర్క్ యొక్క శక్తిసామర్థ్యాలు యధాపూర్వ స్థాయికి చేరుకునేందుకు, అత్యున్నత స్థాయి సేవా ప్రమాణా లు పాటించేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ సందర్భంగా డీహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్ ఇండియా కంట్రీ మేనేజర్ ఆర్ఎస్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ‘‘మా వినియోగదారులకు తిరుగులేని నాణ్యతను అందించేందుకు డీహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్ కృషి చేస్తోంది’’ అని అన్నారు. ‘‘మా విమానయాన, గ్రౌండ్ నెట్ వర్క్ ను నిర్మించుకునేందుకు, హబ్స్, కేంద్రాలను మెరుగుపరుచుకునేందుకు, డిజిటైజే షన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు వార్షిక రేట్ల సవరణ మాకు వీలు కల్పిస్తుంది. ఇవన్నీ కూడా మా వినియోగదారుల అవసరాలను మరింత సమర్థంగా తీర్చేందుకు అండగా ఉండేవే. మహమ్మారి కొనసాగుతున్న ప్పటికీ మేం ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్టంగా మారుతున్న నియంత్రణ, భద్రత పరిస్థితులకు, నిబంధనలకు అనుగుణంగా ఉండేందుకు మా పెట్టుబడులను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ విధమైన ముందడుగులు మా వినియోగ దారులకు మాన సిక ప్రశాంతతను అందించడంతో పాటుగా పరివర్తన చెందడంలో మార్కెట్ లో మాకు గల అగ్రస్థానాన్ని మేము నిలబెట్టుకోగలుగుతాం’’ అని అన్నారు.
డిహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్ వార్షిక ప్రాతిపదికన రేట్లను సర్దుబాటు చేస్తుంది. ద్రవ్యోల్బణం, కరెన్సీ చలనశీలతలను, నియంత్రణ, భద్రత చర్యల వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. డీహెచ్ఎల్ తన సేవలను అందించే 220 కి పైగా దేశాలూ, భూభాగాల్లో ప్రతీ ఒక్కదానిలో కూడా క్రమం తప్పకుండా ఈ విధమైన చర్యలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు అప్ డేట్ చేయబడుతాయి. స్థానిక పరిస్థితులపై ఆధారపడి, రేట్ల సర్దుబాట్లు దేశం నుండి దేశానికి మారుతూ ఉంటాయి. అందరు కస్టమర్లకు వర్తిస్తాయి.