Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 300 పాయింట్ల పతనం
ముంబయి : వరుసగా రెండో రోజూ భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. కరోనా కేసులు మరింత పెరగడంతో దీర్ఘకాలంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించనుందన్న భయాల్లో మంగళవారమూ మదుపర్లు అమ్మకాలను కొనసాగించారు. బిఎస్ఇ సెన్సెక్స్ 300 పాయింట్లు లేదా 0.79 శాతం పతనమై 37,734కు పడిపోయింది. దీంతో సెన్సెక్స్ 38వేల దిగువకు జారినట్లయ్యింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 97 పాయింట్లు తగ్గి 11,154 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటి, ఫార్మా మినహా అన్ని రంగాలు నష్టాలను చవి చూశాయి. ఆటో సూచీ 1.75 శాతం, రియాల్టీ 1.85 శాతం, లోహ సూచీ 1.18 శాతం చొప్పున నష్టపోయాయి. ఐటి రంగం 0.70 శాతం, ఫార్మా 0.66 శాతం చొప్పున రాణించాయి. బిఎస్ఇలో మిడ్ క్యాప్ 1.7 శాతం, స్మాల్ క్యాప్ 1.6 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. సెన్సెక్స్-30లో 9 సూచీలు లాభపడగా.. 21 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.