Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ వాహన కంపెనీ ఫోర్డ్ ఇండియా తమ వినియోగదారులకు ఇంటి వద్దే సేవలను అందించనున్నట్టు ప్రకటిం చింది. ఈ సర్వీసుల ద్వారా ఇల్లు లేదా కార్యాలయం వద్దే ఎటువంటి అదనపు రుసుం లేకుండానే సేవలను పొందవచ్చని పేర్కొంది. తన మొదటి దశలో హైదరాబాద్ సహా పలు కీలక నగరాల్లో డోర్స్టెప్ సర్వీసులు అందిస్తున్నట్టు పేర్కొంది. తమ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఈ సేవలు పొందవచ్చని తెలిపింది. క్రమం తప్పకుండా నిర్వహణ, ఆయిల్, ఫిల్టర్ మార్పు, డ్రై-వాషింగ్, సాధారణ చెకప్ తదితర సర్వీసులు లభ్యమవుతాయని పేర్కొంది.