Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 'మెగా రుణమేళా' కార్యక్రమాన్ని ఇండియన్ బ్యాంక్ అక్టోబరు 29న నిర్వహించింది. అమీర్పేట ధరం కరమ్లో ఉన్న మైక్రోసెట్ బ్రాంచ్ శాఖ ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందించే ఈ మెగా రుణ మేళా కార్యక్రమం జరిగింది. ఖైరతాబాద్, జూబ్లి హిల్స్, యూసుఫ్గూడ, కూకట్పల్లి, మూసాపేట, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిల్స్కు సంబంధించిన 625 మహిళా సంఘాల గ్రూపులకు ఈ కార్యక్రమం ద్వారా రూ.31 కోట్లు మంజూరుచేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ ఎఫ్జిఎం ఎకే మహాపాత్ర, జోనల్ మేనేజర్ యంబి సురేష్ కుమార్, డిజెడ్యం అరుణ్ మహపాత్ర, బ్రాంచి మేనేజర్ శ్రీ యం.డి.విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. గ్రూపు సభ్యులకు ఏదైనా వ్యాపార అభివృద్ధి నిమిత్తం అదనంగా రుణం ఇచ్చేందుకు బ్యాంకు వారు సిద్ధంగా ఉన్నట్టు ఫీల్డ్ జనరల్ మేనేజర్, జోనల్ మేనేజర్ తెలిపారు.