Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డిసి)తో ఫిక్కీకి చెందిన మహిళా విభాగం ఎఫ్ఎల్ఒ ఒప్పందం కుదర్చుకున్నట్లు ప్రకటించింది. ఇరు సంస్థల ఒప్పందంలో భాగంగా మహిళ సాధికారత కోసం వారిని ఔత్సాహికవేత్తలుగా ప్రోత్సహించనున్నారు. వివిధ పనుల్లో మహిళలను ప్రోత్సహించడం ద్వారా దేశాభివృద్ధికి పాల్పడవచ్చని ఎన్ఎస్డిసి ఎండి, సిఇఒ మనీష్ కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం వివిధ ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంచనున్నట్లు పేర్కొన్నారు.